Sunday, May 2, 2010

విజ్ఞాన వినోద ప్రదర్శన శ్రీకాకుళం లో, Exibition in Srikakulam Town





శ్రీకాకుళం పట్నం లో ప్రతి సమ్వత్సరమూ వేసవి సెలవులలలో పిల్లలకు వినోదాన్ని , విజ్ఞానాన్ని అందించే ఉద్దేశం తో " వినోద విజ్ఞాన ప్రదర్శన జిల్లా కలెక్టర్ గారి అధ్వర్యం లో యేర్పాటు చేస్తున్నారు . ఇది వేసవి లొ ఆటవిడుపుగా సాయంత్రము వేళ ప్రజలకు కాసింత ఊరట కల్గిస్తుంది .

1978 లో అప్పటి కలెక్టర్ దానం నిర్వహణలో ఎన్క్ష్ టీ ఆర్ పురపాలక ఉన్నత పాఠశాల మైదానము లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తుండేవారు . అప్పటిలో రెండు ఏళ్ళకు ఒక సారి ఫిబ్రవరి నెల లో ఏర్పాటు చేసేవారు . ఎన్నో వానిజ్య వ్యాపార కేంద్రాలు స్టాల్స్ గా ఏర్పాటు అయ్యేవి . కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూవుండేవి .
అనిల్ చంద్ర పునేథ కలెక్టర్ గా ఉన్న సమయం లో ఎగ్జిబిషన్క్ష్ సొసైటీ ద్వారా ఏప్రిల్ మొదటి వారం లొ ప్రరంభించేవారు . వేలం పాట ద్వారా వచ్చే ఆధాయాన్ని వివిధ కార్యక్రమాలకు వినియోగిస్తూ మూలనిధిగా కొంత ఉంచేవారు .


పెద్ద మార్కెట్ ని ఎంటిర్(N.T.R ) ముంచిపల్ హైస్కూల్ మైదానం లోనికి మార్చడం వలన ఎగ్జిబిధన్క్ష్ ని పి.ఎస్.ఎం.ఎం. హైస్కూల్ మైదానం లోనికి మార్చారు . రోజు సాయంతం వేసవివినోదం గా సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి . కొద్ది కాలం క్రితం ప్రభుత్వ అధికారులను సొసైటీ నుండి తప్పించి పురపాల పరిధిలొకి మార్పుచేశారు . ప్రభుత్వ సౌజన్యం లేకపోవడం తో ఎగ్జిబిషన్క్ష్ కొంత మేరకు ఆకర్శణ కోల్ఫోయినది . ముంచిపాలిటీ అధికారులు వేలం పాట ద్వారా రాజకీయ ప్రమేయం ఉన్న వారికే ఎగ్జిబిషన్క్ష్ నడిపింఛేందుకు మాచ్-ఫిచ్చ్ అవడంతో అంతా వ్యాపార ధోరణిగా , నాసిరం గా మారినది .


  • =============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !