Showing posts with label రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం శ్రీకాకుళం లో. Show all posts
Showing posts with label రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం శ్రీకాకుళం లో. Show all posts

Friday, April 2, 2010

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం శ్రీకాకుళం లో , Rajiv Health Scheem in Srikakulam




2007 ఏప్రిల్‌ ఒకటిన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టినారు .రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో రూ.64 కోట్లు ఖర్చు చేసి 22,927 మందికి శస్త్ర చికిత్సలు చేయించి ఆరోగ్యవంతులను చేశామని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌ పి.తిరుపతిరావు తెలిపారు.
శ్రీకాకుళం పట్టణంలోని
1.రిమ్స్‌ జనరల్‌ ఆసుపత్రి,
2.సింధూర ఆసుపత్రి,
3.బగ్గు సరోజినీదేవి ఆసుపత్రితో పాటు

రూరల్ ఏరియాలో->
4.పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తున్నారు .
5.నరసన్నపేట లొ భరత్ నరసినంగుహోం ,

జిల్లాలో
85 మంది ఆరోగ్యమిత్రలు,
17 మంది నెట్‌వర్కు ఆసుపత్రి మిత్రలు,
5 గురు రీజనల్‌ కో ఆర్డినేటర్లు,
1 (ఒకరు) జిల్లా కో ఆర్డినేటర్‌ పనిచేస్తున్నారు

-------------------
సవంత్సరం- చికిత్సలు
------------------
2007-08- 4,127
2008-09- 9,157
2009-10- 9,643
----------------
న్యూరోసర్జరీ చికిత్సలు ఎక్కువగా జరిగాయని, రెండవ స్థానం గుండెకు సంబంధించి, గర్భస్థ సంబంధ వ్యాధులు ఎక్కువగా జరిగాయని కో ఆర్డినేటర్‌ పేర్కొన్నారు. జిల్లాలో తెల్లకార్డు, ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డు ఉన్నవారు, పేదప్రజలు ఈ పతాకాన్ని వినియోగించుకోవాలి .

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశపెట్టడం లోని ఉద్దేశం మంచిదే అయినా .... కార్పోరేట్ హాస్పిటళ్ళు ఎక్కువగా లాభపడ్డాయి . చిన్న చిన్న ఆపరేషన్ కి అయ్యే ఖర్చు ఎక్కువ మొత్తం లో చూపించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు .


  • ====================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.