Showing posts with label భూసార పరీక్షా కేంద్రం శ్రీకాకుళం జిల్లాలో. Show all posts
Showing posts with label భూసార పరీక్షా కేంద్రం శ్రీకాకుళం జిల్లాలో. Show all posts

Friday, May 6, 2011

Soil Testing Laboratory in Srikakulam , భూసార పరీక్షా కేంద్రం శ్రీకాకుళం జిల్లాలో


శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ భూములు , సాగునీటి వనరులు విస్తారము గా ఉన్నాయి . జిల్లాలోని 38 మండలాల పరిధిలో ఏటా సుమారు ఐదు లక్షల ఎకరాలలో సాగు జరుగుతోంది . పంట దిగుబడి కీలక భూమిక పోషించే భూసార పరీక్షలపై ఇక్కడ రైతులకు అవగాగన కొరవడింది . దీనిపై రైతుల్ని చైతన్యము చేయాల్సిన వ్యవసాయశాఖ అధికారులు శ్రద్ధ తీసుకోవడం లేదు . భూసారము తెలుసుకోకుండా ఎప్పుడూ ఒకే రకము ఎరువును వాడకం వల్ల భూసారము పెరగక పోగా , నిర్జీవముగా మారుతోంది . వ్యవసాయ రంగం లో రైతులు రాణించకపోవడానికి ప్రధాన కారణాలలో ఇదొకటి .


జిల్లా వ్యాప్తం గా భూసార పరీక్షలు జరిపెందుకు ఆమదాలవలస పట్టణ శివారు పారిశ్రామికవాడ ప్రాంతం లో ఒకే ఒక కేంద్రం ఉంది . ప్రతి వేసవిలో మండల వ్యవసాయాధికారులు రైతుల వద్దనుండి మట్టి సేకరించి పరీక్షలు జరిపించాలి . గ్రామ సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలి. నత్రజని . భాస్వరము , పొటాషియం ల నిస్పత్తిని గుర్తించి దాని ఆదారముగా రైతులు పంటలు వేసే విధం గా అవగాహన కల్పించాలి . భూమి స్వభావము ఆధారము గా సాగు చేస్తే అధిక దిగుబడులు సాధ్యము . జిల్లాలో 26 వేల నమూనాలు సేకరించి పరీక్షలు చేయాల్సి ఉంది . అలా జరగడం లేదు . జిల్లా అధి కారులకు ఏమాత్రము అవగాహన , అవస్యకత లేనట్లె కనిపిస్తుంది . ఫలితం భూమి నిస్సారము అవుతుంది .
ప్రస్తుతం జిల్లా భూసార పరీక్షా కేంద్రం ఎ.డి.ఎ.(A.D.A) ఉన్నవారు .... G.Satyavati . ఈ అధి కారి కిందను ..... ఎ..ఒ.లు , మండల వ్యవసాయ అధికారులు , పరీక్షలు చేసే లేబొరిటరీ నిపుణులు పనిచేస్తూ ఉంటారు .



  • ==============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.