Showing posts with label నాగావళి గ్రామీణాభివృద్ధి సంస్థ (నైరెడ్‌)శ్రీకాకుళం జిల్లా లో. Show all posts
Showing posts with label నాగావళి గ్రామీణాభివృద్ధి సంస్థ (నైరెడ్‌)శ్రీకాకుళం జిల్లా లో. Show all posts

Wednesday, August 11, 2010

నాగావళి గ్రామీణాభివృద్ధి సంస్థ (నైరెడ్‌)శ్రీకాకుళం జిల్లా లో , NIRED -Rajaam in Sklm dist.


---

రాజాం పట్టణంలో నాగావళి గ్రామీణాభివృద్ధి సంస్థ (నైరెడ్‌)ను స్థాపించి యువతకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇస్తున్నారు. 2003 జనవరిలో జి.ఎం.ఆర్.పౌండేషన్‌ , ఆంధ్రాబ్యాంకుతో సంయుక్తంగా ఈ సంస్థను నెలకొల్పారు. ఇప్పటివరకు పలు జిల్లాలకు చెందిన 5 వేల మందికి పైగా యువతకు భిన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించి వందలాది మంది జీవితాలలో వెలుగులు నింపుతుంది ..

గ్ర్రామీణ , పట్టణ ప్రాంతాల్లో కొద్దిపాటి చదువులు చదివి ఉపాది పొందలేక నిరాశ , నిస్పృహలతో ఉన్న యువతను అక్కున చేర్చుకొని ఓ మంచి ఉపాది అవకాశము కల్పిస్తోంది . ఇప్పటివరకు 4,462 మందికి శిక్షణనిచ్చారు . వీరిలో 3954 మంది వివిధ ఉద్యోగాలు , ఉపాధి సంస్థలలో స్థిరపడ్డారు . నైరెడ్ నేరుగా బ్యాంకుల నుంచి రుణ సదుపాయము కల్పించడంతో నేర్చుకున్న శిక్షణ ను సద్వినియోగము చేసుకొని ఉద్యోగాలలో , సొంత ఉపాదితో లభ్ది పొందుతున్నారు .

శిక్షణలో రకాలు :
ఈ శిక్షణ సంస్థలో 27 అంశాలలో కార్యక్రమాలు రూపొందించారు . 11 అంశాలలో మహిళలకు , 16 అంశాలలో పురుషులకు శిక్షణ ఇస్తారు . శిక్షణ కాలము లో ఉచిత భోజన , వసతి సౌకర్యాలు కల్పిస్తారు . ఇదే సమయం లో యోగా , స్పోకె్న్‌ ఇంగ్లిష్ లో శిక్షణ ఇస్తున్నారు . రైతులకు ఆధునిక సేస్య పద్ధతులు , స్వయం శక్తి సంఘాల సభ్యులకు వ్యాపార చిట్కాలు నేర్పుతున్నారు . మారుతున్న పరిస్థితులకు అనుగుణం గా సెల్ ఫోన్‌ మరమ్మత్తులు చేయడం లొ శిక్షణ ఇస్తున్నారు . టెలివిజన్‌ మరమ్మత్తులు కూడా నేపుతున్నారు . ఇది స్వయం ఉపాదికి ఎంతో తోడ్పడుతుంది . ఇంకా ...
పదో తరగతి ఉత్తీర్ణులైనవారికి .. ఎలక్ట్రీషియన్‌,
రైతులకు డ్రిప్ ఇరిగేషం లొ శిక్షణ ,
సర్ఫ్ , ఫినైల్ , బ్లీచింగ్ , షాంపూ తయారీలో గ్రామీణ మహిళలకు శిక్షణ ,

సందర్శకులు :
సంస్థ చేపడుతున్న కార్యక్రమ్మలను చౌసి ఎందరో ప్రముఖులు ప్రశంసించారు . భార మాజీ రాస్ట్రపతి ' అబ్దుల్ కలాం ' భేష్ అన్నారు . ఇక్కడ శిక్షణ పొందిన వారికి తమ సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పించేందు కు ఎల్.అండ్. టి . చైర్మన్‌ ముందుకు వచ్చారు . కేంద్ర సహాయమంత్రి ... పురంధరేస్వరి , ఎం.పి... మధుయాస్కీ గౌడ్ , చినజీయర్ స్వామి , తి.తి.దే. కార్యనిర్వహణాధికారి ... ఐ.వై.ఆర్.కృష్ణారావు వంటి ప్రముఖులు సందర్శించారు .

ఆర్దిక స్తోమత లేక అరకో చదువుల తో ఆగిపోయిన యువతకు ఉపాది కల్పించడమే ఈ సంస్థ ఆశయము .
  • ==========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.