Tuesday, February 25, 2014

Srikakulam Rajiv Vidya Mission ,శ్రీకాకుళాం రాజీవ్ విద్యామిషన్

  •  



  •  
విద్యా హక్కు చట్టం పర్యవేక్షణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం రాజీవ్‌ విద్యా మిషన్‌కు అప్పగించింది. ఇందుకోసం రాజీవ్‌ విద్యా మిషన్‌ కార్యకలాపాల గడువును మరో రెండేళ్లు పొడిగించింది. ప్రాథమిక విద్య బలోపేతానికి 2001-02లో ప్రారంభమైన రాజీవ్‌ విద్యా మిషన్‌ గడువు నిజానికి  2010తో ముగియాలి.  విద్యా హక్కు చట్టం అమలు కోసం ఇప్పుడు రెండేళ్ల పొడిగింపు లభించింది.
సార్వత్రిక ఎలిమెంటరీ విద్యా (Universal elementary education)సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమమే ”సర్వశిక్ష అభియాన్‌”, ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 2001-02 నుండి రాజీవ్‌ విద్యా మిషన్‌ ద్వారా అమలు చేయబడుతుంది.

బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009. compulsory Education to the Children of 6-14 years age group, a Fundamental Right.

-  01-04-2010 నుండి అమలులోకి వచ్చింది
ప్రతి వ్యక్తి జీవితంలో విద్య అతి ముఖ్యమైనది. విద్య ద్వారా మనిషి మేధస్సు వికసిస్తుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా సుఖమయమైన జీవితాన్ని గడపడానికి దోహదపడుతుంది. విద్యకు ఉన్న ఈ ప్రాముఖ్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం (-) తెచ్చింది. దీని ద్వారా భారత రాజ్యాంగములో విద్య ప్రాథమిక హక్కుల జాబితాలో చేరింది. 1-4-2010 నుండి ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఇది దేశ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు.
ఈ  2009 చట్టంలోని ముఖ్యాంశాలు
1    పిల్లలందరు ఉచిత, నిర్బంధ ఎలిమెంటరీ విద్య పొందే హక్కు కలిగి ఉంటారు.
2    పాఠశాలల ఏర్పాటు, పాఠశాల భవనం, బోధనా సిబ్బంది, బోధనాపరికరాలతో సహా మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటుచేయాలి.
3   పిల్లలందరినీ తప్పకుండా బడిలో చేర్చి, బడి మానకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు తల్లిదండ్రులపై ఉంటుంది.
4    బడి బయట ఉన్న పిల్లలను వారి వయస్సుకు తగిన తరగతులలో చేర్చి ప్రత్యేక శిక్షణను ఇవ్వాల్సి ఉంటుంది.
5   బడిలో ప్రవేశం పొందిన పిల్లలను అదే తరగతిలో మళ్లీ కొనసాగించడం లేదా బడి నుండి తీసివేయడం చేయకూడదు.
6    బాలలను శారీరకంగా, మానసికంగా వేధించడం లాంటివి చేయకూడదు. ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకోబడును.
7    పాఠశాలలన్నీ చట్టంలో పేర్కొన్నట్లు సరైన ప్రమాణాలు పాటించాలి. పాటించని పాఠశాలలకు గుర్తింపు రద్దు చేయబడును.
8    ప్రైవేట్‌ పాఠశాలలు తప్ప అన్ని పాఠశాలల్లో బడి యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలు పాఠశాలల పనితీరును సమీక్షించడం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం వంటి విధులను నిర్వహిస్తుంది.
9    కనీస విద్యార్హతలు ఉన్నవారినే ఉపాధ్యాయులుగా నియమించాలి.
10    ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం, సకాలంలో పాఠ్యాంశాలు బోధించడం, తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం వంటి విధులను నిర్వహించాలి.
11    అన్ని పాఠశాలల్లో చట్టంలో పేర్కొన్న విధముగా తగినంత మంది ఉపాధ్యాయులను నియమించాలి. అలాగే పాఠశాలలన్నింటికి కనీస సదుపాయాలు కల్పించాలి.
12   ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ కమీషన్‌ ఏర్పాటు చేయాలి.

సార్వత్రిక ఎలిమెంటరీ విద్యా (Universal elementary education)సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమమే ”సర్వశిక్ష అభియాన్‌”, ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 2001-02 నుండి రాజీవ్‌ విద్యా మిషన్‌ ద్వారా అమలు చేయబడుతుంది.

ప్రాధాన్యతాంశాలు :
1    5 సం||లు నిండిన పిల్లలందరినీ ఒకటో తరగతిలో చేర్పిద్దాం.
2   బడి బయట పిల్లలను, బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పిద్దాం.
3    బాలికల విద్యను ప్రోత్సహిద్దాం.
4   100% విద్యార్థులను, క్రింది తరగతుల నుండి పై తరగతులకు పంపిద్దాం.
5    ”ప్రత్యేక అవసరాలు” గల పిల్లలకు అందరితో సమానంగా విద్యను అందిద్దాం.
6   ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ & బలహీనవర్గాలవారిపై ప్రత్యేక శ్రద్ధ.
7    పిల్లలందరికీ విద్యనందించే దిశగా అడుగులేద్దాం.

లక్ష్యాలు :

1   బడి ఈడుగల బాలలందరు 2010-2011 విద్యాసంవత్సరంలోగా ఎలిమెంటరీ విద్యలో 8వ తరగతి వరకు పూర్తిచేసేలా కృషి చేయడం.
2    ఇందుకోసం నాణ్యతతో కూడిన ప్రయోజనకరమైన ఎలిమెంటరీ విద్యపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం.
3    2010-2011 సంవత్సరంలోగా ఎలిమెంటరీ విద్యాస్థాయిలో బాలురు, బాలికల విద్యా వివక్షతను, సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసాలను తొలగించడం.
4    2010-2011 విద్యా సంవత్సరంలోగా సార్వత్రిక నిలుపుదలను సాధించడం.

రాజీవ్‌ విద్యా మిషన్‌ - ద్వారా అమలు అవుతున్న కార్యక్రమములు

1    ప్రతి ఆవాస ప్రాంతంలోని బడి ఈడు గల బాలబాలికలందరికీ ఒక కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, లేదా ప్రత్యామ్నాయ విద్యా సౌకర్యం కలిగించడం. అవసరం మేరకు ఉపాధ్యాయులను, విద్యా వాలంటీర్లను నియమించడం.
2    పాఠశాల భవన నిర్మాణాలు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహరిగోడలు, మంచినీరు మొదలైన మౌలిక సదుపాయాలు కలిగించడం.
3    సగటున ప్రతి పాఠశాలకు ప్రతి సంవత్సరం భవన నిర్వహణకై నిర్వహణ గ్రాంటు క్రింద ప్రాథమిక పాఠశాలకు రూ.5000/- ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.7500/- అందజేయడం.
4    నూతనంగా ప్రారంభించిన ప్రాథమిక పాఠశాలకు 20,000/- రూపాయలు ప్రాథమికోన్నత పాఠశాలకు 50,000/- రూపాయలు చొప్పున బోధనాభ్యాసన సామాగ్రి గ్రాంటు అందజేయడం.
5   వచ్చే సంవత్సరం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 5000/- రూపాయలు గ్రాంటుగా అందజేయడం.
6   బోధనాభ్యాసన సామాగ్రి తయారీ కొరకు ప్రతి ఉపాధ్యాయునికి 500/- రూపాయలు గ్రాంటు అందజేయడం.
7    రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా విడుదలైన గ్రాంటుల వివరాలు ప్రజలందరికి తెలియజేయడం కోసం పాఠశాల సముదాయం, మండల విద్యా వనరుల కేంద్రాల వెలుపల బ్లాక్‌ బోర్డులపై నిధుల ఖర్చుల వివరాలు పొందుపరచడం.
8    ఉపాధ్యాయ శిక్షణలు నిర్వహించడం.
9    ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య కొరకు శిక్షణ పొందిన రిసోర్స్‌ టీచరును మండలానికి ఒకరిని నియమించడం, పిల్లలకు ఉపకరణాలు అందించడం, చిన్న చిన్న ఆపరేషనులు చేయించడం.
10   ప్రాజెక్టులో భాగంగా పరిశోధన, మూల్యాంకనం నిర్వహించడం.
11   ప్రాథమిక విద్య, కంప్యూటర్‌ విద్య మొదలైనవాటికి నిధులు కేటాయించడం.
12   పాఠశాల కేంద్రాల నిర్వహణకై నిధులు సమకూర్చడం.
13   పిల్లలను తరగతులలో చేర్చడానికి వీలుగా రెసిడెన్షియల్‌, నాన్‌రెసిడెన్షియల్‌ బ్రిడ్జి కోర్సు కేంద్రాలు వంటి విద్యాసౌకర్యాలను కల్పించడం.
14    బడి మానిన బాలికల కోసం కస్తూరిబాగాంధి విద్యాలయాలను ఏర్పాటు చేయడం.
15    మదర్సాలలో చదువుకున్న విద్యార్థులకు అరబ్బీతోపాటు ఉర్దూ, ఆంగ్లంలో బోధించుటకు వీలుగా సహకారాన్ని అందించడం.
16    బాలికా విద్య కొరకు రాజీవ్‌ విద్యామిషన్‌లో ఒక విభాగాన్ని నిర్వహించడం.

గుణాత్మక విద్యతోపాటు బాలికల వ్యక్తిత్వ వికాసం, లింగ వివక్ష నిర్మూలన, బాలబాలికల నమోదు, నిలకడ మధ్యగల అంతరాన్ని తగ్గించడం కోసం విద్యతో – వ్యాయామం, అట్టడుగువర్గాల బాలికల కోసం ఆవాస విద్యాలయాలు

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు :
 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉచిత ఆవాస విద్య, బాలికల సాధికారత, సంపూర్ణ విద్యావికాసం, భద్రమైన భవిత కొరకు ఎలిమెంటరీ స్థాయి బాలికల జాతీయ విద్యాకార్యక్రమం, బాలికల సంపూర్ణ అక్షరాస్యత, సర్వశిక్షా అభియాన్‌లో భాగంగా ఎలిమెంటరీ స్థాయి ”బాలికల జాతీయ విద్యా కార్యక్రమం”
6 నుండి 14 సం||ల వయస్సు గల బాలికల కొరకు ప్రత్యేకంగా అమలు చేయబడుతున్నది . ప్రత్యేక శిక్షణ పొందిన రిసోర్సు ఉపాధ్యాయుల ద్వారా విద్యను అందించడం. వైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి ఉపకరణాలు అందించడం మరియు శస్త్ర చికిత్సలు చేయించడం.

 రాజీవ్‌ విద్యా మిషన్‌కు విద్యా హక్కు బాధ్యత-:
విద్యా హక్కు చట్టం పర్యవేక్షణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం రాజీవ్‌ విద్యా మిషన్‌కు అప్పగించింది. ఇందుకోసం రాజీవ్‌ విద్యా మిషన్‌ కార్యకలాపాల గడువును మరో రెండేళ్లు పొడిగించింది. ప్రాథమిక విద్య బలోపేతానికి 2001-02లో ప్రారంభమైన రాజీవ్‌ విద్యా మిషన్‌ గడువు నిజానికి  2010తో ముగియాలి.  విద్యా హక్కు చట్టం అమలు కోసం ఇప్పుడు రెండేళ్ల పొడిగింపు లభించింది.   రాజీవ్‌ విద్యా మిషన్‌కు 2010-11 ఆర్థిక సంవత్సరానికి రూ.1100 కోట్లను కేటాయించారు. తాజాగా విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి మరో రూ.660 కోట్లు కేంద్రం నుంచి పొందాలని ప్రాథమిక విద్యాశాఖ ప్రతిపాదనలను రూపొందించింది.
విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు వంతున సర్దుబాటు చేయాలి. దీని ప్రకారం సుమారు 20వేల మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అధికారుల అంచనా. మరోవైపు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే 70లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం ఇవ్వనున్నారు. జతకు రూ.200 వంతున వ్యయం చేయనున్నారు.
బాలల హక్కులను పర్యవేక్షించేందుకు 'రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ'ని ఏర్పాటు చేయనున్నారు.  అథారిటీ బాధ్యతలను హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన విద్యావేత్తకు అప్పగించాలని నిబంధనలు చెబుతున్నాయి.

బట్టీల వద్దే బడి!

 ఇటుకబట్టీ కార్మికుల పిల్లల కోసం రాజీవ్ విద్యామిషన్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్మికుల పిల్లలకు ఉచిత ప్రాథమిక విద్యనందించేందుకు కొత్తగా ‘పని వద్దకే పాఠశాల’ పేరుతో బడులు చేసేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ బడుల్లో పిల్లలకు మాతృభాషలోనే బోధన చేపట్టనున్నారు. మెరుగైన సౌకర్యాలతో ఈ బడులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా రాజీవ్ విద్యామిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం new పాఠశాలలను ప్రారంభించనున్నారు. అవసరం మేరకు ఈ సంఖ్య పెంచనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 30 మందికి ఒక టీచర్
 ప్రస్తుతం Srikakulam జిల్లాలో దాదాపు 430 ఇటుకబట్టీలున్నట్లు కార్మికశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ బట్టీల వద్ద దాదాపు మూడున్నరవేల మంది పిల్లలున్నట్లు ఆ శాఖ ప్రాథమికంగా అంచనాలు వేసింది. దీంతో ముప్పై మంది పిల్లలకు ఒక పాఠశాలను ప్రారంభించేందుకు జిల్లా రాజీవ్ విద్యామిషన్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కో పాఠ శాలకు ఒక టీచర్‌ను నియమించనున్నారు. బట్టీల్లో పనిచేస్తున్న వారిలో ఎక్కువ కార్మికులు ఒడిశా రాష్ట్రానికి చెందినవారే కావడంతో ఒరియా భాషలో బోధించే టీచర్లనే ఎంపిక చేస్తున్నారు. ఈ బాధ్యతను ఆర్వీఎం అధికారులు మూడు ఎన్జీఓలకు అప్పగించారు.

 ఉచిత స్టడీ మెటీరియల్
 ఈ పాఠశాలలకు వచ్చే పిల్లలకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను రాజీవ్  విద్యామిషన్ అధికారులు అందజేయనున్నారు. సోమవారం మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో కొందరికి నామమాత్రంగా మెటీరియల్ పంపిణీ చేశారు. అయితే పూర్తిస్థాయిలో ఈనెల 30న పిల్లలందరికీ మెటీరియల్ పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఒడిశా రాజ్యసభ సభ్యుడు జెపాండా హాజరుకానున్నారు.

 మరోవైపు విద్యార్థులందరికీ యూనిఫాం పంపిణీ చేసేందుకు కార్మిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పాఠశాలల వద్ద వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.





  •  ==================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !