Thursday, June 11, 2015

Costal development in Srikakulam dist,శ్రీకాకులం లో సాగరతీర సంపద







రాష్ట్రము లోనే అత్యధిక విస్తీర్ణము కలిగిన సముద్ర తీర ప్రాంతమున్న జిల్లా శ్రీకాకుళం జిల్లా. జిలాల్లో 193 కిలోమీటర్ల  విస్తీర్ణములో సముద్ర తీరము వ్యాపించి ఉంది . ఇచ్చాపురం నుంచి రణస్థలం వరకు 9 మండలాలో 104 గ్రామాలలో 50 వేల మత్స్య కార కుటుంబాలకు ఉపాది కల్పిస్తుంది. పరోక్షము గా మరో 100 గ్రామాలు ప్రజలు తీరము పైనే ఆధారపడి బతుకుతున్నారు. తీరానికి ఆనుకొని 53 వేల ఎకరాల కొబ్బరి తోటలు , లక్ష ఎకరాల జీడిమామిడి తోటలు ఉన్నాయి. సముద్ర తీరము నుండి 10 కిలోమీటర్ల పరిదిలోనే జిల్లా ప్రజలు ప్రధానము గా ఉపాది పొందుతున్నారు.

మత్స్య సంపద ఆధారముగా :

శ్రీకాకుళం జిల్లాలో 5500 పడవలు ఆధారము గా మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారు. అందులో 15 శాతము సందనే వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. సుమారు ఏడాదికి 800 - 1000 కోట్ల రూపాయిల అదాయము ఉంటుంది.

కాలుష్యరహిత పరిశ్రమలకు అనుకూలముగా ఉంటుంది. తీర ప్రాంతానికి 5-10 కిలోమీటర్ల పరిదిలోనే జాతీయ రహదారి , రైల్వేసదుపాయము ఉండడముతో  కాలుశ్యరహిత పరిశ్రమలకు మంది అవకాశము ఉంటుంది. కొబ్బరి , జీడిమామిడి పరిశ్రమలు ,ఇసుక  పరిశ్రమలకు అనువుగా ఉంటుంది.

ఓడ రేవులు  :
జిల్లాలో ఓడ రేవుల ఏర్పాటుకు అనువుగా కళింగపట్నం , భావనపాడు  ఉన్నాయి.

పర్యాటక ప్రదేశాలు :

బారువ , కళింగపట్నం , బావనపాడు , మొగదలపాడు , అక్కుపల్లి  బీచ్ లు విహార కేంద్రాలు గా అభివృద్ధి చెందాయి. 11 మండలాలలొ 20 ప్రాంతాలు పర్యాటక కేంద్రాలు గా జిల్లా ఆదాయాన్ని పెందుకోవచ్చు.

టైగర్ రొయ్య పిల్ల పరిశ్రమ :

అత్యధిక విదేశీ మారకద్రవ్యము తెచ్చిపట్టే టైగర్ రొయ్యపిల్లల ఉత్పత్తి కి జిల్లా తీరప్రాంతము అనువుగా ఉంటుంది. 2007 లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు జిల్లాలో అద్యనము చేసి సోంపేట , సంతబొమ్మాలి , గార మండలాలు టైగర్ రొయ్యపిల్లల ఉత్పత్తికి  అనుకూల ప్రాంతాలు గా గుర్తించారు.

పూలసాగుకు అనుకూలము :

శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతములో 15 వేల హెక్టార్ల వరకు చిత్తడి నేలలున్నాయి. సహజ సిద్ధముగా ఏర్పడిన వాటితోపాటు కాల్వలు , చెరువులు , నదీ సంగమ ప్రాంతాలలో ఏర్పడిన  ఈ నేలల పరిధిలో పూలసాగు చేసేందుకు  అవకాశాలున్నాయని ఉద్యానవన శాఖ అధికారులు స్పష్టము చేస్తున్నారు. వివిధ రకాల పూలమొక్కలు , ఔషధ మొక్కలు పెంచేందుకు తీరప్రాంత భూములు  చాలా అనుకూలము. ఇదే విధము గా తీరప్రాంతాలలో ఉప్పు తయారీ కి అనుకూలము .

అక్వా పరిశ్రమ :
శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతములో రొయ్యల సాగుకు ఎంతో అనుకూలము .ప్రస్తుతానికి కేవలము 12 ఎకరాకలో ఆక్వా పరిశ్రమ నడుస్తూ ఉంది. రణస్థమ్లము తీరము లో చేపలు ఎండబెడుతూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !