Monday, September 28, 2009

Hatakeswara swamy temple at Singupuram













It is the only Cave temple of Srikakulam district on Sindura hill . Inscriptions on the pillar establish that it was constructed during 11th Century A.D. Every year in the month of Chaitram (February / march ) kalyanotsavam is celebrating auspiciously for 9 days . Here on the hill-top there is a holy spring through which holy water springs out through out the year.

ఆలయ పూజారి - పెంట రామకృష్ణ శర్మ గారు చెప్పిన స్థలపురాణము :

పూర్వము ఒకప్పుడు ప్రయాగ పుణ్యక్షేత్రము దగ్గర భ్రుగు , వశిష్ట ,వామదేవ , అత్రి , భరద్వాజ, మున్నగు మహర్షులు అంతా కలిసి చేసిన యజ్ఞము నందు శివునిచే అవమానింపబడ్డ దక్షుడు " భూతప్రేత పిశాచ గణములతో కూడి శ్మశాన వాసియైయి దిగంబరుడువు గా నుందువు గాక " అని శివునే శపించగా ... వేద వేదంగా పారాయనుడు ను , బ్రహమునుడు ను అయినందున దక్షునకు శివుడేమి అనకున్నా ... కోపోద్రిక్తుడైన నందీశ్వరుడు ప్రతిశాపముగా "బుద్ధి జ్ఞానము లేని యాచాకుదవుడవు గాక " అని శపించెను . ఆప్పటినుంది దక్షుడు అల్లుడైన శివుని యందు , శివ గణాల యందును ద్వేషియై ప్రవర్తించు చూ ... కొంత కాలము తర్వాత , శివుని పరభావించుటకె అన్నట్లు ద్రాక్షారామము లో దక్ష యజ్ఞము నారంభించి , ముక్కోటి దేవతలను , ఋషులను , రాజులను , బ్రహ్మ , విష్ణు , నారదాది మహర్షులను ఆహ్వానించి శివుని , కూతురైన సతీ దేవిని పిలవలేదు .

తండ్రి (దక్షుడు) చేస్తున్న యజ్ఞము వార్త , యజ్ఞము నాకు వెళ్తున్న రోహిణి- చంద్రుల చెలికత్తె ద్వారా తెలుసుకున్న సతీదేవి, భర్త (శివుని) ఆనతి తీసుకొని పిలవని పేరంటానికి , శివగానాలతో కలసి వెళ్లి .. తండ్రి చేసిన పరాభవానికి మూర్చిల్లి పోగా ... అది తెలుసుకున్న శివుడు రుద్రుడి రూపము దాల్చి యజ్నవాటికను ద్వంశము చేసి ముర్చిల్లిన సతీదేవిని తీసుకొని ఆకాశ మార్గమున కైలాసానికి ప్రయనమాయేను . అది చూసిన విష్ణు , బ్రహ్మాది దేవతలు శివ స్తోత్రము చేయగా ... శాంతించిన శివుడు మార్గమధ్యములో ఒక పర్వతముపై కాలుపెట్టి (దిగి) , అప్పటికే స్పృహ నుండి బయటపడ్డ సతీదేవిని ఆ పర్వతము పై ఉంచి యోగాగ్ని లో పడి చనిపోతానన్న సతీదేవిని శాంతింప జేసి యోగిని అయి యోగాదీక్ష లో ఉండమని, తగిన శక్తిని పొందిన తరువాత హిమగిరికి పుత్రికవై పార్వతి గా తనని చేరుకొమ్మని ఆజ్ఞాపించెను . ఆ పర్వతమే సింగుపురము (సింహగిరి) కి పడమరన ఉన్న "సింధూర " పర్వతము .

కొంత కాలము తరువాత యోగనిద్రలో ఉన్న సతీదేవి దేహ త్యాగము గావించు కొని జ్యోతియై హిమగిరి , "మేనక - హిమవంతు " లకు పుత్రిక గా మరో జన్మ లో అడుగిడెను .

సింహపురి ని రాజధాని గా చేసుకొని సింహబలుడు అనే రాజు .. రాజ్యపాలన చేయుచుండెను . రాజు మహా శివ భక్తుడు , ప్రతినిత్యము శ్రీకాకుళం లో కొలువై ఉన్న ఉమరుద్ర కోటేశ్వర స్వామిని కొలుస్తూ ఉండేవారు . ఒక రాత్రి తన కలలో అమ్మవారు (దేవి) ని కొండపై చూసునట్లు స్వప్నకు కని ... కలలో దేవి ఆజ్ఞా ప్రకారము ఆలయము కట్టి "చైత్ర శుద్ధ సప్తమి మొదలు బహుళ పాడ్యమి వరకు నవరాత్ర దీక్షాకంకన బద్ధుడై భక్తితో శాక్తేయ సంప్రదాయానుసారము , "జప పూజ , బలి హోమాది కార్యక్రమములు ప్రతి ఏటా చేయుచూ ",కులదైవము గా కొలుచు చుండెను . కొండ దిగువభాగాన ఒక కోనేరు తవ్వబడి ఉన్నదనీ ... దేవీ మహత్యము వల్ల కొనపై నుండి ఒక నీటి పాయ వచ్చి చేరుతూ ఉండేదని పురాణాలలో చెప్పబడి ఉన్నది .

పార్వతీ పరమేశ్వరులు కళ్యాణము తరువాత ... ఒకానొక రోజున ఏకాంత సమయము లో శివుడు సతీదేవి వృత్తాంతమును పార్వతీ దేవికి చెప్పెను . కధవిన్న పార్వతి, సతీ దేవి యోగిని గా జ్యోతి రూపము చెందిన ఆ పర్వత ప్రదేశమును చూడాలని కోరగా ... కలియుగమున తన భక్తులైన మానవులను పాపవిముక్తులను చేయు కార్యార్ధము తానూ అవతరించు సమయము లో తన కోరిక తీరునని సెలవిచ్చేనని పురాణాలు తెలియజేయుచున్నవి .

కాలానుక్రమములో రాజ్యాలు పోయాయి , యుగాలు మారిపోయాయి , రామరాజ్యము పోయే , శ్రీకృష్ణ రాజ్యము పోయే , కలియుగామారంబము అయ్యెను . భారత ఖండములో ఎన్నో మార్పులు సంభవించాయి , హిందూ దేశాన్ని కొల్లకొట్టి ముస్లింలు రాజ్యపాలన గావించారు . ఎన్నో హిందూ దేవాలయాలు , గోపురాలు , భవనాలు కూలగోట్టబడ్డాయి . అయిననూ ఈ దేవిమాత ప్రజలచే పూజింపబడుతునే ఉంది . . . కాని చాలా దీనావస్తలో ఉండి సింహబలుడు ప్రతిష్టించిన విగ్రహాలు , ప్రతిమలు ముక్కలై తలోచోట పడిఉండేవి . ఈ పరిస్థి కి జాలిపడి , బాధపడిన , ఆప్రాంతానికి చెందిన , మహా శివ భక్తుడైన " నారాయనప్ప " అనే బ్రాహ్మణుడు శివుని కై ఘోర తపమాచరించి , శివ అనుగ్రహమును పొంది , వరము కోరుకోమ్మనినా ఆశపడక మోక్షాన్ని కోరుకున్న అతనికి ,శివుడు బంగారాన్ని తయారుచేసే " స్వర్నయోగము " అనే బంగారము ను తయారుచేసే విద్యనూ భోధించి , దేవి ఆలయాన్ని పునరుద్ధరించి తనని ప్రతిష్టించి ఆరాధించి మోక్షము పొందమని ఉద్భోదించెను . ఆ విధం గా క్రీ .శ. ము . 11 - 12 శతాబ్దముల మధ్య కాలములో ఈ ఆలయం పునః ప్రతిష్ట చేయబడినది .

బంగారానికి " హాటక" అనే మరో పేరు కలదు ... హాటక వరమును ప్రసాదించిన శివునకు "హాటకేశ్వర స్వామీ" అని అమ్మవారు ని 'ఉమా ' అని "ఉమా హాతకేస్వరస్వామి " అని ఆ పూజారి , ఆ ఆలయాన్ని పిలుస్తూ ఎంతో అభివృద్ధి చేశారు . ఇప్పటికి తన వంశీయులు పూజారులు గా ఉంటూ వస్తున్నారు . ఆ కుటుంబీకుడే ఈ పెంట రామకృష్ణ శర్మ .

ఈ ఆలయానికి ఉత్తరమున 'వంశధార' నది , దక్షిణమున 'నాగావళి ' నది ఉన్నాయి, సుమారు 60 ఎకరముల పొలము ఈనామి భూములు ఉన్నాయి .

కరజాడ గ్రామానికి చెందిన " కొండమ్మ" అనే వైశ్య కుంటుంబానికి చెందిన బాలిక దేవి అనుగ్రహము తో పుట్టినదని , తన పెండ్లి సమయం లో జ్యోతి అయి పార్వతి లో ఐక్యము అయినది అని చరిత్ర కలదు . అందుచే ఈ స్వామిని " ఉమా కొండమ్మ హటకేస్వరస్వామి " అని పిలిచే అలవాటు కలదు .
ఈ ఆలయము లో
1. శ్రీ హటకేస్వరస్వామి ,
2. పార్వతీ దేవి ,
3. కొండమ్మవారు ,
4. శ్రీ త్రిశూల స్వామి ,
5. అన్నపూర్ణమ్మ (వృద్ధి కొండమ్మ )
వెలసి ఉన్నారు .

ఉత్సవాలు :
౧ . చైత్ర్స్ శుద్ధ సప్తమి -- ధ్వజారోహణము
౨ , దశమి ఆహ్వానము --- పెండ్లి పిలుపు ,
౩ . ఏకాదశి --- కళ్యాణము ,
౪ . త్రయోదశి --- సదస్యోత్సవము ,
౫. చతుర్దశి ---దోపోత్సవము ,
౬. పౌర్ణమి -- వసంతోత్సవము ,
౭ . బహుళ పాడ్యమి -- శక్తి ఉత్సవము ,

విజయదశమి , కార్తీగ పౌర్ణమి , కనుమ , మహాశివరాత్రి పర్వదినములందు స్వామి పుష్పక ము నందు గిరిజ కొండమ్మల తో కలిసి గ్రామమంతయు ఉరేగి భక్తులకు దర్శన భాగ్యము కలిగించును . మహాశివరాత్రి నాడు స్వామి వంశధార పున్యనదీ జాలములో శుక్రస్నానమాచారించును .. జనము స్వామిని అనుసరించి తమ మొక్కు బడులను తీర్చుకుంటూ స్వామి కృప పొందుచున్నారు .
==============================================================
Visit my Website > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !